స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాటి అనుబంధ బ్యాంకులను విలీనం చేసే బిల్లుకు టిఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఈ విలీనం ద్వారా సాధారణ ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీ బూర నర్యయ్య గౌడ్ కోరారు. ఈ అంశంపై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఇన్నాళ్లు బడా పారిశ్రామిక వేత్తలకు పరిమితికి మించి బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయని, వాటి కారణంగా చాలా మంది డిఫాల్టర్లుగా మారి బ్యాంకులకు నష్టం చేశారని ఆయన గుర్తుచేశారు. సాధారణ ప్రజలకు రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని బూర నర్సయ్య గౌడ్ సూచించారు.