ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాఫిక్ లో చిక్కుకున్న కేటీఆర్...సెల్ఫీలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 10, 2017, 06:52 PM

సాధారణంగా ముఖ్యమంత్రుల బహిరంగ సభలు జరుగుతున్నపుడు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంటాయి. అయితే కొన్ని సార్లు ఆ ట్రాఫిక్ ఉచ్చులో ప్రముఖులు కూడా చిక్కుకుంటుంటారు. అదే తరహాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు ఐటీ మంత్రి కేటీఆర్ కు కూడా ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. నిజామాబాద్ జిల్లా పోచంపాడులోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవన్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళుతున్న కేటీఆర్ ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు. 


శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవన్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఈ రోజు  శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బహిరంగ సభను నిర్వహించారు. నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. `1996లో ఎస్సారెస్పీ కట్టమీదకు వచ్చి చూస్తే పరిస్థితి దీనంగా కనిపించింది. ఆంధ్రా పాలకులు ఏం చేసినా తమ ప్రాంత ప్రయోజనాలను ఆశించే చేశారు తప్ప తెలంగాణపై ప్రేమతో కాదు. పరిస్థితులు బాగుపడాలంటే స్వరాష్ట్ర సాధనే మార్గమని ఆనాడే చెప్పాను. రాష్ట్రాన్ని సాధించి తీరుతానని ఎస్సారెస్పీ సాక్షిగా అప్పుడే శపథం చేశాను. ఇన్నాళ్ల తర్వాత రాష్ట్రాన్ని సాధించి ఎస్సారెస్పీకి పునరుజ్జీవం చేసేందుకు మీ ముందుకొచ్చాను.


శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవన్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఈ రోజు  శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బహిరంగ సభను నిర్వహించారు. ఆ బహిరంగ సభకు వెళ్లే వాహనాలతో రహదారులన్నీ రద్దీగా మారాయి. దీంతో కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సభకు హాజరయ్యేందుకు వెళుతున్న కేటీఆర్  సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. కేటీఆర్ వాహనం అక్కడి ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయింది. దీంతో కేటీఆర్ సభాస్థలికి వెళ్లలేకపోయారు. ఇదే విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ట్రాఫిక్ జాం అయిన చోట కేటీఆర్ ను జనాలు గుర్తించి ఆయనతో షేక్ హ్యాండ్స్ - సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.


కాగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవన్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఈ రోజు  శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బహిరంగ సభను నిర్వహించారు. నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. `1996లో ఎస్సారెస్పీ కట్టమీదకు వచ్చి చూస్తే పరిస్థితి దీనంగా కనిపించింది. ఆంధ్రా పాలకులు ఏం చేసినా తమ ప్రాంత ప్రయోజనాలను ఆశించే చేశారు తప్ప తెలంగాణపై ప్రేమతో కాదు. పరిస్థితులు బాగుపడాలంటే స్వరాష్ట్ర సాధనే మార్గమని ఆనాడే చెప్పాను. రాష్ట్రాన్ని సాధించి తీరుతానని ఎస్సారెస్పీ సాక్షిగా అప్పుడే శపథం చేశాను. ఇన్నాళ్ల తర్వాత రాష్ట్రాన్ని సాధించి ఎస్సారెస్పీకి పునరుజ్జీవం చేసేందుకు మీ ముందుకొచ్చాను అని అన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com