హైదరాబాద్ : డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను తస్కరిస్తూ వాటితో బ్యాంకు ఖాతాలను సైబర్ ఛీటర్లు లూటీ చేస్తున్నారు. గతంలో ఎప్పు డో ఓ సారి ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చేవి. తాజాగా 15 రోజుల నుంచి మూడు కమిషనరేట్లలోని సైబర్క్రైమ్ పోలీసులకు ప్రతి రోజు 10 ఫిర్యాదుల వరకు అందుతున్నాయి. షాపింగ్లు చేసినప్పుడు వినియోగదారులు వాడిన డాటా అపహరణకు గురవుతుందని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. షాపింగ్లో ఉపయోగించిన కార్డును స్వైప్ చేసినప్పుడే, వినియోగదారుడికి తెలియకుండా కార్డు వివరాలను ఆయా షాప్ల్లో పనిచేసే వారిలో ఎవరు దానిని అపహరిస్తున్నారు.
ఇలా అపహరించిన డాటాను ఎప్పటికప్పుడు సైబర్ ఛీటర్లకు పంపిస్తుండడంతో ఇతర రాష్ర్టాల్లో కొన్ని ముఠాలు క్లోనింగ్ చేస్తున్నట్లు పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. వారం రోజుల క్రితం ముగ్గురు ఖాతాదారుల కు తెలియకుండానే బంజారాహిల్స్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు డ్రా చేశారు. ఇక్కడ ఉపయోగించిన కార్డులు క్లోనింగ్ కార్డులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్డుల వివరాలను విక్రయిస్తున్న ముఠాలు.. కార్డులను తయారు చేసి విక్రయిస్తున్న ము ఠాలపై సైబర్క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ముఠాల కోసం గాలింపు చేపట్టారు.