కోల్కతా: ప్రైవేటు ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న 23 ఏళ్ల యువతి అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. ఎయిర్హోస్టెస్గా చేస్తున్న కంగ్సిట్ క్లారా బన్సా రాయ్ తాను ఉంటున్న అపార్ట్మెంట్లోని మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది. షిల్లాంగ్కు చెందిన ఈ యువతి ఫ్రెండ్స్ పార్టీకి వెళ్లి వచ్చిన తర్వాత శవమై కనిపించింది. తన ఫ్లాట్లో ఉన్న కిటీకి నుంచి క్లారా కిందపడినట్లు, ఆమె మృతదేహాన్ని అపార్ట్మెంట్ ముందు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎయిర్హోస్టస్ మృతికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. అది ప్రమాదమా లేక ఆత్మహత్యా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు పంపారు.