బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్కేజ్రీవాల్ తన 49వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దిల్లీకి చెందిన రాఘవ్ మండల్ అనే భాజపా నేత కేజ్రీవాల్కి పుట్టినరోజు కానుకగా రూ.500 విలువైన లెదర్ షూస్ కానుకగా ఇచ్చాడు.కేజ్రీవాల్ జాగింగ్ చేసేటప్పుడు ఖరీదైన షూస్ వేసుకుంటారు కానీ బహిరంగ సభలకు, సమావేశాలకు మాత్రం సాధారణ చెప్పులు వేసుకుంటారని రాఘవ్ మీడియా ద్వారా వెల్లడించారు. అందుకే ఆన్లైన్లో లెదర్ షూస్ ఆర్డర్ చేసి కానుకగా పంపానని పేర్కొన్నాడు.