సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ సారధి నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే 68 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశామని మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. నగరంలో లక్ష ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వ పధకాలు పేదలకు పారదర్శకంగా అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, హౌసింగ్ డీఈ సుధాకర్, ఎమ్ఆర్ఓ సైదులు, కార్పొరేటర్ షాహిన్ బేగం తదితరులు పాల్గొన్నారు.