కరీంనగర్ లోని ఇందిరానగర్ లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు తనిఖీలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 64 ద్విచక్ర వాహనాలు, కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్, వంటనూనె, లైసెన్స్ లేకుండా అమ్ముతున్న టపాసులు స్వాధీనం చేసుకున్నారు.