వరంగల్ లో ఏర్పాటు చేయబోయే కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ స్థలాన్ని దక్షిణ కొరియా జౌళి పరిశ్రమల సమాఖ్య ఛైర్మన్ కొఫొటీ కిగ్ హాంకాన్ సందర్శించారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం, గీసుకొండ మండలాల్లో ఆయన పర్యటించారు. శాయంపేట హవేలీలో మెగా టెక్స్ టైల్ పార్క్ స్థలాన్ని పరిశీలించారు. పార్కుకు సంబంధించి సలహాలు, సూచనలు చేశారు. వరంగల్ లో పర్యటించడం ఆనందంగా ఉందని కిగ్ హాంకాన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, టీఎస్ ఐఐసి అధికారి నర్సింహారెడ్డి, ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు స్థానిక అధికారులు కొరియా బృందానికి పార్క్ వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడి చేనేతలను వారు పరిశీలించారు.