మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు తెలంగాణ మహిళా పోలీసులకు హీరో మోటర్స్ సంస్థ 159 స్కూటీలను అందచేసింది. హైదరాబాద్ లోని హోటల్ మారియట్ లో జరిగిన కార్యక్రమంలో హీరో మోటార్స్ సంస్థ ప్రతినిధి స్కూటీ తాళంచెవులను అప్పగించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 70, సైబరాబాద్ లో 50, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు 39 స్కూటీలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఇంచార్జ్ స్వాతిలక్రా, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ శాండిల్య, మహేష్ భగవత్ తదితరులు హాజరయ్యారు.