గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదట తునికి బొల్లారం గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బండమైలారం, మజీద్పల్లి గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను ఎంపీ ప్రారంభించారు. మఖ్తా పాసన్ పల్లిలో అంగన్ వాడి భవనాన్ని, పిడిచేడ్ లో మహిళా భవన్ లను ఎంపీ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.