వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, ఉదయం సాయంత్రం రాజరాజేశ్వరీదేవికి చతుషష్ఠి ఉపాచారాలతో విశేషపూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం శ్రీమహాలక్ష్మి అమ్మవారికి షోడషోపచార పూజలు నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేశారు. భక్తులకు లఘుదర్శనం అమలు చేస్తున్నారు.