రంగారెడ్డి : హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కుంట్లూరు క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి నుంచి 880 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.