ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్‌ వరదల్లో 153 మంది మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 19, 2017, 11:20 AM

 బిహార్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. నేపాల్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా నదుల్లో నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో బిహార్‌ సహా యూపీలో వరదలు సంభవించాయి. వరదల ధాటికి బిహార్‌లోని17 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పటికే 153 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.


అరారియాలో 30 మంది, పశ్చిమ్‌ చంపారన్‌ 23, సీతామర్హి 13, మధుబాణి 8, కతిహార్‌ 7, కిసాన్‌గంజ్‌ 11, తూర్పు చంపారన్‌ 11, సుపౌల్‌ 11, పూర్ణియా 9, మాదేపురాలో 9 మంది చొప్పున మరణించారు. దర్భంగాలో నలుగురు, గోపాల్‌గంజ్‌ 4, సహస్ర 4, ఖగారియా 3, షియోహర్‌ 3, సరన్‌ 2, ముజఫర్‌పూర్‌లో ఒకరు వరదల కారణంగా మృతిచెందినట్లు విపత్తు నిర్వహణ విభాగం ప్రత్యేక కార్యదర్శి అనిరుధ్‌ కుమార్‌ తెలిపారు.


వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కోటి మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ నుంచి 1,152 మంది సిబ్బంది, ఆర్మీ నుంచి 2,228 మంది సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాగా.. పట్నా, గయా, భగల్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో నేడు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com