హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో మహిళా హెల్ప్లైన్ 181 సేవలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. గృహహింస, వరకట్నం వేధింపులకు సంబంధించిన సమస్యలపై ఈ మహిళా హెల్ప్లైన్ పనిచేయనున్నట్లు మంత్రి వివరించారు. పనిచేసే చోట వేధింపులు, మహిళల సమస్యలపై ఈ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ హెల్స్లైన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.