వరంగల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు ఆకర్షిలవుతున్నారు. బంగారు తెలంగాణలో భాగస్వాములయ్యేందుకు నర్సంపేటకు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సివిల్ సైప్లె చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బీజేపీ నేత కొమ్ము నవీన్ టీఆర్ఎస్లో చేరారు. కొమ్ము నవీన్కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. నవీన్తో పాటు 250 మంది బీజేపీ కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.