చెన్నై: డీఆర్ఐ అధికారులు భారీ సంఖ్యలో నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని అవడి ప్రాంతంలో డీఆర్ఐ, ఫారెస్ట్ ప్రొటెక్షన్ స్వ్యాడ్ టీం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి..అంతరించిపోయే దశలో ఉన్న 2515 తాబేళ్లను సీజ్ చేసింది. తాబేళ్లను సరఫరా చేస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.