బీహార్: బీహార్లో వరదల ఉధృతి అంతకంతకూ పెరిగిపోతున్నది. వరదల కారణంగా బీహార్లో ఇప్పటివరకు 341 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బీహార్లోని వివిధ జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. ముంపుగ్రామాల ప్రజలు ఇంటి సామాను తీసుకుని అతి కష్టం మీద సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. ధర్బాంగ జిల్లాలో కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పడవల సాయంతో కాలనీవాసులు వేరే ప్రాంతాలకు వెళుతున్నారు.