నాకు అమ్మాయిలంటే ద్వేషం అంటున్నారు ‘రోగ్’ సినిమా హీరో ఇషాన్. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా పరిచయమౌతున్న ‘రోగ్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఇందులో ఇషాన్ ఈ డైలాగ్ చెబుతూ కనిపించారు. ట్రైలర్ను ప్రేమ, యాక్షన్ సన్నివేశాలతో చూపించారు. బుధవారం విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్లో రెండో స్థానంలో ఉంది.
కన్నడంలోనూ తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా కథానాయికలుగా నటిస్తున్నారు. సి.ఆర్. మనోహర్, సి.ఆర్. గోపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ సింగ్, ఆజాద్ ఖాన్, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.