హైదరాబాద్ : మొదటి తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులందరికీ తెలుగును పాఠ్యాంశంగా బోధించడాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్రప్రభుత్వం చట్టం రూపొందించాలని యోచిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ముసాయిదా చట్టాన్ని అధికారులు రూపొందిస్తున్నట్టు తెలిసింది. మంత్రివర్గం ఆమోదం తర్వాత ముసాయిదా బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. తెలుగును మరిచిపోతున్న నేపథ్యంలో తెలుగు బోధనను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్స్కూళ్లకు తప్పని సరిచేయనున్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ను బోధించే పాఠశాలలు కూడా తెలుగును పాఠ్యాంశంగా బోధించాలనే విషయమై బిల్లులో స్పష్టత ఇవ్వనున్నారు