వచ్చే సంవత్సరం రైతు సమన్వయ సమితికి రూ.500కోట్లు కేటాయించామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.మీడియాతో మంత్రి మాట్లాడుతూ… రెవెన్యూ, వ్యవసాయ శాఖ సమన్వయంతో భూసర్వే చేయిస్తామన్నారు. రైతు సమన్వయ సమితులు చేసే మొట్టమొదటి పని భూ సర్వే అని స్పష్టం చేశారు. పారదర్శకంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరుగుతోందని, ప్రతి మూడు గ్రామాలకు రైతు సమావేశ మందిరాలు నిర్మిస్తామన్నారు. రైతు సమన్వయ సమితులు పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాయని, పార్టీలకతీతంగా వచ్చే ఏడాది నుంచి రైతులకు రూ.8వేలు పెట్టుబడి ఇస్తామన్నారు.