ప్రొకబడ్డీ 5వ సీజన్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ లీగ్ పోటీలు రాంచీలో జరుగుతున్నాయి. నిత్యం బిజీగా ఉండే భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం తెలుగు టైటాన్స్-పట్నా పరేట్స్ మధ్య జరిగిన మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించారు. మైదానం గ్యాలరీ నుంచి మ్యాచ్ వీక్షించిన ఆయన క్రీడాకారులను ప్రోత్సాహపరిచారు.
ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 30-46 తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 16మ్యాచ్లు ఆడిన టైటాన్స్ 11 ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించే దశకు చేరుకుంది. తెలుగు టైటాన్స్ తన తదుపరి మ్యాచ్లో బెంగళూరు బుల్స్ను ఢీకొట్టనుంది.