వరంగల్ : కాజీపేట రైల్వేకోర్టుకు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో రైల్రోకో సందర్భంగా నమోదైన కేసులో కోర్టుకు హాజరైనట్లు కడియం తెలిపారు. కేసు విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది రైల్వే కోర్టు. కడియం శ్రీహరితో పాటు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు.