నల్గొండ: కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక వస్తే స్వాగతిస్తామని ఆయన తెలిపారు. అధిష్టానం టికెట్ ఇస్తే నేనే పోటీ చేస్తానని ఆయన వివరించారు. పీసీసీ అధ్యక్షుడు పోటీ చేసినా అందరం కలిసి పని చేస్తామని ఆయన వెల్లడించారు. వైన్ షాపులకు రెండు గంటల సమయం పెంచారన్నారు. మద్యం ఆదాయం రూ. 12 వేల కోట్ల నుంచి...రూ. 26 వేల కోట్లకు పెంచుకున్నారని చెప్పుకొచ్చారు.