హైదరాబాద్: వనజీవి కోటి మొక్కల రామయ్యకు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాశారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టి మూడేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోటి మొక్కల రామయ్య సేవలను మోదీ ప్రశంసించారు.
‘స్వచ్ఛతే సేవ’ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ప్రముఖులకు ప్రధాని లేఖ రాసిన సంగతి తెలిసిందే. వీరిలో తెలుగు సినీ ప్రముఖులూ ఉన్నారు.