ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బతుకమ్మ ఏర్పాట్లపై సీఎస్ ఎస్పీ సింగ్ సమీక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2017, 06:02 PM

హైదరాబాద్: నగరంలోని బతుకమ్మ ఘాట్ వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుక నిర్వహణపై సీఎస్ అధికారులతో నేడు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఈ నెల 26న హైదరాబాద్‌లో జరిగే మహాబతుకమ్మ వేడుకకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ వేడుకల్లో జిల్లాల నుంచి 40 వేల మంది మహిళలు పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 28న నిర్వహించే బతుకమ్మ వేడుకకు 200 మంది మహిళలతో లుంబినీ పార్కు నుంచి ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై 30 గ్రూపులుగా మహిళలు బతుకమ్మ ఆడి నిమజ్జనం చేస్తారన్నారు. కావునా బతుకమ్మ ఘాట్ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com