హైదరాబాద్: నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి తెలంగాణ అసెంబ్లీని నేడు సందర్శించారు. ఈ సందర్భంగా శాసనసభ ఆవరణలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ఆయన నివాళి అర్పించారు. భారతయాత్రలో భాగంగా కైలాస్ సత్యార్థి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న కైలాస్ సత్యార్థికి శాసనసభాపతి మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్రావు, కేటీఆర్, జగదీష్రెడ్డి, ఎంపీలు వినోద్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు, అధికారులు కైలాస్ సత్యార్థికి విందు ఏర్పాటు చేశారు.