వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్లలో 31వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో పోటీలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ రామ్మోహన్ రెడ్డి, శాట్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ర్టానికి చెందిన 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. రాష్ట్రంలో క్రీడాకారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సాహం కూడా ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు.