ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్య ఖర్చుల కోసం ఎల్‌ఓసీ కింద ఏడు లక్షలు మంజూరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 24, 2017, 04:50 PM

హైదరాబాద్: పేదరికంలో ఉండి వైద్యం చేయించుకోలేక నిమ్స్ ఆసుపత్రిలో చేరిన ముగ్గురికి ఉపముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి విజ్ఞ‌ప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడు లక్షల రూపాయలను ఎల్‌ఓసీగా మంజూరు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని దౌలత్ నగర్‌కు చెందిన ఏ రాజుకు లక్ష రూపాయలు, అదే జిల్లా ఉప్పరపల్లి, చెన్నారావుపేటకు చెందిన ఎండీ హమీద్‌కు 2 లక్షల రూపాయలు, జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలోని శివాజినగర్‌కు చెందిన కే మాధవ్‌కు 4 లక్షల రూపాయలు మంజూరు చేశారు. వైద్య ఖర్చుల కోసం ఎల్‌ఓసీ కింద డబ్బులు మంజూరు చేయడంతో లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ధన్యవాదాలు తెలియజేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com