మహబూబాబాద్ లో పద్మశ్రీ వనజీవి రామయ్య సతీసమేతంగా మొక్కలు నాటారు. ఆ తర్వాత ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని చెత్తను ఊడ్చారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని వనజీవి రామయ్య కోరారు. రామకోటి రాసినట్లు పర్యావరణ పరిరక్షణ కోసం కోటి మొక్కలే లక్ష్యంగా నాటాలని సూచించారు.