యాదాద్రిభువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో విషాద సంఘటన చోటుచేసుకుంది. భార్యభర్తలు ఇరువురు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. భర్త బొంత వెంకటేష్(28), భార్య మహేశ్వరి(25) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి తొమ్మది సంవత్సరాల బాబు, ఆరు సంవత్సరాల పాప ఉన్నారు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న గొడవలే ఇందుకు కారణంగా సమాచారం.