హైదరాబాద్ : కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల పోస్టర్ను మంత్రి జోగు రామన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. బాపూజీ జీవితాంతం తెలంగాణ కోసం కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. 1915, సెప్టెంబర్ 27న జన్మించిన బాపూజీ.. 2012, సెప్టెంబర్ 21న స్వర్గస్తులైనారు.