నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పిట్లంలోని బాలాజీ ట్రేడర్స్లో భారీ చోరీ జరిగింది. బాలాజీ ట్రేడర్స్లోకి చొరబడ్డ దుండగులు కాపలాదారుడిని కట్టేసి చోరీకి పాల్పడ్డారు. దుండగులు లాకర్ను బయటకు తీసుకువచ్చి ధ్వంసం చేసి రూ.15.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.