హైదరాబాద్ : పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన పౌరసేవల నిర్వహణకుగాను జీహెచ్ఎంసీకి కేంద్ర పర్యాటక శాఖ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ జీహెచ్ఎంసీకి ప్రకటించిన 2015-16 నేషనల్ టూరిజం అవార్డును బుధవారం న్యూఢిల్లీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి స్వీకరించనున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఈ అవార్డును మేయర్, కమిషనర్లకు అందజేయనున్నారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛ కార్యక్రమాలు ప్రధానంగా పారిశుధ్య కార్యక్రమాలను అత్యంత మెరుగైన రీతిలో నిర్వహించేందుకు చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, ప్రజలు భాగస్వామ్యం తదితర అంశాలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్కు కేంద్ర పర్యాటక శాఖ ఉత్తమ పౌర సేవల నిర్వహణ అవార్డును ప్రకటించింది.