సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ను గెలిపిస్తే కార్మికుల సమస్యల పరిష్కారానికి నెలరోజులకోసారి గ్రీవెన్స్ డే ను నిర్వహించనున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తెలిపారు. ఎస్సీసీఎల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే జలగం ఇవాళ కొత్తగూడెం ఏరియా లోని ఎస్&పీసీ, 7షాఫ్ట్ బొగ్గుగని, 7 ఇంక్లయిన్, వర్క్ షాప్, సింగరేణి ప్రధాన ఆస్పత్రి తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీబీజీకేఎస్ గెలిస్తేనే కార్మికులకు, వారి కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి బంగారు సింగరేణిగా రూపుదాల్చనుందని పేర్కొన్నారు.