పారిపోండి, ఆత్మాహుతి దాడి చేయండి
ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్
ఆత్మాహుతి దాడి చేస్తే, అమితానంద స్వర్గ సుఖం
చేతులెత్తేసిన అబూ బకర్ చెబుతున్నది ఇదే!
సిటీ అంతటా బాంబులు పెట్టి వెళ్లిన ఐసిస్
మేము ఖలీఫా సైనికులం.. చైనాలో రక్తం ఏరులై పారుతుంది చూడండి ఐఎస్ఐఎస్ తీవ్ర హెచ్చరికలు
ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ నోటి వెంట సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. ఇరాక్లో ఐఎస్ఐఎస్ ఓడిపోయిందని ఆయన అంగీకరిం చాడు. అరబ్బులు కాని పోరాట యోధులంతా తమ తమ దేశాలకు వెళ్లిపోవాలని కోరాడు. అలా చేయ డం ఇష్టం లేకుంటే ఆత్మాహుతి దాడి చేసి తమను తాము పేల్చుకోవాలని తాజా వీడియో ప్రసంగంలో చెప్పినట్టు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది.
రఖ్కా : `వీడ్కోలు ప్రసంగం' పేరిట ఈ ప్రకటన విడుదల కాగా, మోసుల్ నగరాన్ని ఇరాక్ సైన్యం పూర్తిగా ఆక్రమిం చడంతో ఉగ్రవాదులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సందేశంలో ఐఎస్ఐఎస్ స్టేట్ కార్యాలయాన్ని మూసేయాలని ఆయన తెలిపారు. ఆత్మా హుతి దాడి చేసుకున్నవారు స్వర్గానికి వెళతారని, అక్కడ వారికోసం 72 మంది యువతులు ఎదురు చూస్తుంటా రని కూడా చెప్పాడు. కాగా, అల్ బగ్దాదీని పట్టుకుంటే రూ. 66 కోట్ల నగదు బహుమతిని పలు దేశాలు ప్రకటిం చిన సంగతి తెలిసిందే. 2014 ఆరంభంలో తూర్పు సిరియా, ఉత్తర ఇరాక్ పరిధిలోని చాలా ప్రాంతాలను ఉగ్రవాదులు ఆక్రమించగా, ఆ తరువాత ఇరాక్ సైన్యం ఒక్కో ప్రాంతాన్నీ తిరిగి తన అధీనంలోకి తెచ్చుకుంది. ఐఎస్ఐఎస్ సామ్రాజ్యానికి తాను రారాజునని ప్రకటించు కుని, రెండేళ్లపాటు సిరియా,ఇరాక్లలో మారణ హోమం సౄష్టించి, చివరికి ఓటమిని అంగీకరించిన అబూ బకర్ అల్ బగ్దాదీ చివరిగా తన సైన్యానికి ఇచ్చిన సందేశంలో వారికి పలు సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఈ పోరాటం లో ఓడిపోయామని చెబుతూనే, మిగిలిన వారు ఆత్మా హుతి దాడులు చేస్తూ మరణిస్తే, వారికి అమితమైన ఆనం దాన్ని ఇచ్చే స్వర్గ సుఖాలు లభిస్తాయని, వారి కోసం అంద మైన అమ్మాయిలు సిద్ధంగా ఉంటారని చెబుతున్న వీడి యోను ఇరాకీ టీవీ చానళ్లు `అల్ సుమారియా', `అల్ అరే బియా' వెల్లడించాయి. ఆయన తన `వీడ్కోలు ప్రసంగం' ను ఇచ్చారని, ఈ వీడియో కాపీలను ఐఎస్ఐఎస్ మత బోధకులు, పెద్దలకు మంగళవారం