నకిరేకల్ మండలం చందన్పల్లి వద్ద జాతీయ రహదారి 65పై శనివారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని నకిరేకల్కు చెందిన లింగమ్మ(65)గా పోలీసులు గుర్తించారు. కారు.. విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. నకిరేకల్ నుంచి చందన్పల్లికి ఆటో వస్తుండగా కారు ఢీకొట్టింది. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆటోను ఢీకొట్టిన కారు నెంబర్.. టీఎస్ 10 యూఏ 4550.