వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. పొత్తు విషయంలో మార్పు ఉండదని ఆయన చెప్పారు. జమిలి ఎన్నికలపై బీజేపీ ఆలోచన చేస్తోందని ఆయన అన్నారు. జీఎస్టీ అమలులో ఇబ్బందులు త్వరలో తొలగిపోతాయని చెప్పుకొచ్చారు. జీడీపీ తగ్గిందనడంలో వాస్తవం లేదని ఆయన వివరించారు. యూపీఏ ప్రభుత్వం హయాంతో పోలిస్తే జీడీపీ ఎక్కువగానే ఉందన్నారు. సోలార్ విద్యుత్ విషయంలో ఏపీ కృషి ప్రశంసనీయమని తెలిపారు. త్వరలో వెయ్యిమెగావాట్ల సోలార్విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సోలార్ పంపుసెట్లు, ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు భేష్ అని ఆయన మెచ్చుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి సహకరిస్తామని ఆయన వివరించారు.