యాదాద్రి భువనగిరి : భువనగిరి శివారులోని రాయగిరి వద్ద గల పట్టుపరిశ్రమల శాఖకు చెందిన 12 ఎకరాల స్థలంలో జిల్లా కలెక్టరేట్, వివిధ శాఖల సమీకృత భవన సముదాయ నిర్మాణానికి విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్రెడ్డి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గొంగిడి సునీత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, జేసీ రవినాయక్, డీఆర్డీవో వెంకట్రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.