న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో రైల్ చార్జీల పెంపునకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేటి నుంచి ఆందోళన చేపట్ట నుంచి. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలోని అన్ని మెట్రో రైల్వే స్టేషన్ల వద్దా ఆప్ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఈ ఏడాదిలో మెట్రో రైలు చర్జీలు పెంచడం ఇది రెండో సారని ఆయన విమర్శించారు. ఆందోళనలో భాగంగా 13వ తేదీన పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన వెల్లడించారు.