హైదరాబాద్: నగరంలోని మాధాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తగూడలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో యోగా టీచర్గా పనిచేస్తున్న ఓ మహిళ మృతిచెందింది. ధనలక్ష్మీ అనే యోగా టీచర్ పక్కనే ఉన్న బొటానికల్ గార్డెన్లో ఉదయం యోగా క్లాసులు చెప్పి తిరిగి వస్తున్న సమయంలో కొత్తగూడ సమీపంలో భారీ ట్రాలీ లారీ ఆమెను ఢీకొంది. దాంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.