తిరుమల : శ్రీవారిని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో అశ్వినీదత్.. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి ఆయనకు దర్శనం చేయించారు. అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అశ్వినీదత్కు తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు. స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అశ్వినీదత్ పేర్కొన్నారు.