ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓ బౌలర్‌ వేసిన బంతులను ఎదర్కోనేందుకు ఇబ్బంది పడ్డాను

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 12, 2017, 10:31 AM

 భారత్‌ తరఫున రెండు త్రిశతకాలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌.. బౌలర్‌ ఎవరైనా బ్యాట్‌ ఝుళిపించి పరుగులు రాబట్టడం అతని నైజం.. ఇంతకీ అతను ఎవరో గుర్తుకొచ్చిందా.. ఇంకెవరు మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. అతడు కూడా ఓ బౌలర్‌ వేసిన బంతులను ఎదర్కోనేందుకు ఇబ్బంది పడ్డాడట. అంతేకాదు ఒక్కోసారి ఔటవుతాడేమోనని భయపడ్డాడట కూడా. ఆ బౌలర్‌ ఎవరంటే శ్రీలంక దిగ్గజ బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌.


తాజాగా వీరూ ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్‌ ఎవరో చెప్పడంతో పాటు మరికొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘నేను ఎదుర్కొన్న బౌలర్లలో శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్‌ చాలా కఠినం. అతను వేసిన బంతిని షాట్‌ కొట్టేందుకు చాలా కష్టపడేవాడిని. ఒక్కోసారి ఎక్కడ ఔటైపోతానోనని భయం కూడా వేసేది. అంతేకాదు అతని ముఖ కవళికలు నన్ను ఒత్తిడికి గురిచేసేవి. అతను మినహా ఏ బౌలర్‌నైనా నేను సునాయాసంగానే ఎదుర్కొన్నా’ అని సెహ్వాగ్‌ తెలిపాడు.


ప్రస్తుతం సెహ్వాగ్‌ భారత్‌-ఆసీస్‌ మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్‌లో వ్యాఖ్యాతగా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com