సీఎం కేసీఆర్ ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కార్యాలయాల సముదాయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. చివ్వెంల మండలంలో 400 కేవీ సబ్స్టేషన్, మిషన్ భగీరథ పనులను సీఎం ప్రారంభించనున్నారు. అలాగే.. సూర్యాపేటలో చంద్రసేన గుప్తా విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం సూర్యాపేటలో జరగనున్న బహిరంగ సభకు సీఎం హాజరవుతారు.