హైదరాబాద్ : పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ రోజు నుంచి అమరవీరుల స్ఫూర్తి యాత్ర నిర్వహించనున్న కోదండరాం తన నివాసం నుంచి బయలుదేరడానికి ముందే పోలీసులు భారీగా మోహరించడంతో ఈ యాత్రపై సందేహాలు నెలకొన్నాయి. కోదండరాంను తన నివాసం నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకే పోలీసులు మోహరించారని జేఏసీ విమర్శిస్తున్నది. ఇలా ఉండగా యాత్రకు అనుమతి కోసం హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసేందుకు జేఏసీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.