హైదరాబాద్: ఇటీవల గ్రేటర్ హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు 500 ప్రాంతాల్లో రహదారులు పాడైపోయాయని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్రెడ్డి వెల్లడించారు.. వీటిని మరమ్మతు చేసేందుకు రూ.77కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. సాధారణంగా రోజుకు 200-300 గుంతలు పడితే, వర్షం పడినప్పుడు 1000-1200 గుంటలుపడుతున్నాయని కమిషనర్ వెల్లడించారు. చిన్న గుంతలను రెండు మూడు రోజుల్లో మరమ్మతు చేస్తామని, పాడైన రోడ్లను వర్షాలు తగ్గిన తర్వాత బాగు చేస్తామని చెప్పారు. ఈ నెల 23 నుంచి మరమ్మతు పనులు ప్రారంభించనున్నట్లు కమిషనర్ తెలిపారు.