హైదరాబాద్ : సరూర్నగర్లో రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుండగులు హెల్మెట్ ధరించి చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చైన్స్నాచర్స్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.