మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మినీ స్టేడియంలో 63వ రాష్ట్ర స్థాయి అండర్ 17 బాల బాలికల వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్యఅతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డితో పాటు జిల్లా విద్యాధికారి సోమిరెడ్డి ప్రారంభించారు. క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత.. క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం ప్లేయర్లను పరిచయం చేసుకుని వారితో కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. మూడు రోజుల పాటు జరగనున్న పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాల నుంచి 240 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ టోర్నీలో ప్రతిభ చూపిన ప్లేయర్లను జాతీయ స్థాయి టోర్నీకి ఎంపిక చేయనున్నారు.