నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులోకి 550 అడుగుల మేర నీరు చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ఇతర ప్రాజెక్టులనుంచి వస్తున్న వరద నీరంతా శ్రీశైలం వైపు వస్తోంది. ఇప్పటికే శ్రీశైలం నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువలకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీరు చేరుతోంది. ప్రాజెక్టుకు నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.