సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్ల పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక కొత్తచెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకొని రాహుల్(14), ఎండీ తాజు(13) మృతదేహాల్ని వెలికితీశారు. అంబేడ్కర్నగర్లోని పాఠశాలలో చదువుతున్న వీరు నిన్న సాయంత్రం చెరువులో ఈత కోసమని ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.