రంగారెడ్డి: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. శంషాబాద్లోని ఓ హోటల్ ప్రారంబోత్సవానికి హాజరయిన ఆయన.. అక్కడే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. అయితే.. ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో వెంటనే ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.